గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ, రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ అభ్యర్థి జి. గోపాల్ రెడ్డిని సర్పంచ్గా ఎన్నుకున్నందుకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అయ్యవారిపల్లి గ్రామస్తులను, నాయకులను అభినందించారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గోపాల్ రెడ్డి ఏకైక అభ్యర్థిగా నిలవడంతో సర్పంచ్గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ రెడ్డిని సత్కరించి, పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.