షాద్నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన భీమారం, ఉప్పరిగడ్డ, చించొడ్ గ్రామాల్లో పర్యటించి, కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.