రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) అధ్యక్షుడు ఆశన్న పర్యవేక్షణలో షాద్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మండల అధికారులకు వికలాంగుల సమస్యల పరిష్కారానికి శనివారం మెమోరాండంలు అందజేశారు. ఫరూక్ నగర్ మండలం డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్, కొందుర్గు మండలం డిప్యూటీ తహసీల్దార్ రాకేష్, చౌదర్ గూడ మండలం జూనియర్ అసిస్టెంట్ సౌందర్యకు వినతిపత్రాలను అందించారు.