ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈనెల 4న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటన సందర్భంగా, 'ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ' ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరారు.