షాద్నగర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు సంగారెడ్డి కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ నుండి సి. స్వప్న నూతన ఎంవీఐ అధికారిగా షాద్నగర్లో నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాసు రెండేళ్లపాటు ఇక్కడ పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి, అన్ని వర్గాల నుండి ప్రశంసలు పొందారు. ఆయన ఎలాంటి వివాదాలు లేకుండా బదిలీ అయ్యారు.