హనుమాన్ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ లోని అభయ ఆంజనేయస్వామిని మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవి భాస్కరయోగిని ఆలయ ధర్మకర్తలు కమ్మదనం సుధాకర్ సన్మానించారు. 12వ వార్డ్ కౌన్సిలర్ దిలీప్, ప్రదీప్ మరోటియా, భరత్ లాహోటి, రాజేశ్వర్, చారి తదితరులు పాల్గొన్నారు.