షాద్ నగర్ పట్టణంలోని 15వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు, కౌన్సిలర్ సాదిక్ ప్రశాంత వాతావరణంలో భయం సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్నారని వార్డు యువ నాయకులు పవన్ సింగ్, ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హనుమాన్ దేవాలయ నిర్మాణంలో నిబంధనలను అధిగమించి సాదిక్ వ్యవహరించారని, దీనిపై మాట్లాడేందుకు వెళ్లినప్పుడు ఇతర నాయకులను చూసి రెచ్చిపోయాడని ఆరోపించారు.