బెంగళూరులో ర్యాపిడో ఆటో డ్రైవర్ మహిళను అసభ్యంగా వేధించిన ఘటన బయటపడింది. సెప్టెంబర్ 8న కుమారస్వామి లే అవుట్లో హనుమంతప్ప హెచ్ తలావర్ అనే డ్రైవర్ ప్రయాణికురాలిపై అసభ్య ప్రవర్తనకు పాల్పడగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ర్యాపిడో సంస్థ స్పందించింది. బెంగళూరులో జరిగిన సంఘటన తీవ్రంగా కలచివేసిందని, డ్రైవర్ను శాశ్వతంగా సస్పెండ్ చేసి, భవిష్యత్తులో రైడ్లు తీసుకోకుండా బ్లాక్లిస్ట్లో చేర్చినట్లు ప్రకటించింది.