AP: ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్లో ఆరుగురు విద్యార్థులపై ఎలుక దాడి చేసింది. నిద్రలో ఉన్నప్పుడే కరవడంతో వారు ఆసుపత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కాలేజీ భవనాల నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో పొదలు, చెట్లు తొలగించకపోవడం వల్ల ఎలుకలు, పురుగులు హాస్టల్లోకి వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఘటనతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది.