
పిల్లల యాంటీబయాటిక్ సిరప్లో పురుగులు
మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. మురార్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం తన బిడ్డను తీసుకొని వచ్చిన మహిళకు ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్లో పురుగులు కనిపించాయి. దీంతో ఆమె సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్కే శర్మకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఔషధ విభాగం సిరప్ పంపిణీని నిలిపివేసి, శాంపిల్స్ను పరిశీలనకు పంపింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ అనుభవి శర్మ బృందం దర్యాప్తు చేపట్టి, ఇప్పటికే సరఫరా చేసిన సిరప్ను రీకాల్ చేయాలని నిర్ణయించింది.




