గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2025లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా UPI చెల్లింపులను సులభతరం చేయడానికి నాలుగు కొత్త యాప్లను ప్రారంభించారు. ఈ యాప్లు ఆన్లైన్ చెల్లింపులను మరింత సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. AI-ఆధారిత UPI, IoT చెల్లింపులు, బ్యాంకింగ్ కనెక్ట్, UPI రిజర్వ్ పే అనే ఈ కొత్త యాప్లు.. మొబైల్ ఫోన్లు, కార్లు, స్మార్ట్వాచ్ల ద్వారా చెల్లింపులు చేయడానికి, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడానికి, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ను ఏకీకృతం చేయడానికి రూపొందించబడ్డాయి.