TG: మూసీ ప్రాజెక్టును తాము వద్దన్నందుకే ఇవాళ నదీ పరీవాహక ప్రాంతాలు మునిగేలా సీఎం రేవంత్ కుట్ర చేశారని మాజీ మంత్రి KTR ఆరోపించారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు.'భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించినా చెరువులను ఖాళీ చేయలేదు. 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసి పేదల ఇళ్లు మునిగేలా చేశారు. ప్రాజెక్టు పేరిట రూ.1,50,000 కోట్లు దోచుకోవాలని చూస్తున్నారు. చరిత్రలో తొలిసారి MGBSలోకి వరద చేరింది' అని అన్నారు.