రాజస్తాన్లోని జైపుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డంపర్ ట్రక్ డ్రైవర్ పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది చనిపోగా.. ప్రస్తుతం మరో 9 మంది దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గాయాలైనవారు చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.