కో – ఆపరేటివ్ బ్యాంక్‌లో చోరీ

15266చూసినవారు
కో – ఆపరేటివ్ బ్యాంక్‌లో చోరీ
బీదర్ ఘటన మరవకముందే కర్ణాటకలో మరో భారీ దోపిడీ జరిగింది. మంగళూరులోని కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.15 కోట్ల విలువైన బంగారంతో పాటు రూ. 5 లక్షల నగదును దొంగలు చోరీ చేశారు. బ్యాంకు ఉద్యోగులను, కస్టమర్లను బెదిరించి వారు దోపిడీకి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ చోరీలో 5 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్