హైదరాబాద్‌లో రోప్‌వేలు.. ప్రజారవాణాకు ప్రణాళిక

15చూసినవారు
హైదరాబాద్‌లో రోప్‌వేలు.. ప్రజారవాణాకు ప్రణాళిక
హైదరాబాద్ మహానగరంలో పర్యాటకంతో పాటు ప్రజారవాణాకు రోప్‌వేల ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వారణాసి మోడల్‌ను అనుసరించి, యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) ఈ కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రభుత్వానికి పాలసీ మార్పుల కోసం ప్రతిపాదనలు పంపారు. పీపీపీ విధానంలో నిర్మించాలని యోచిస్తున్నారు. తొలుత గోల్కొండ నుంచి టూంబ్స్ వరకు, ఆపై జూ వరకు రోప్‌వే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు ఇది పరిష్కారమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్