
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 81,790.12 వద్ద 582.95 పాయింట్ల లాభంతో నిలిచింది, నిఫ్టీ 25,077.65 వద్ద 183.40 పాయింట్ల లాభంతో ముగిసింది. ఈ క్రమంలోనే నిఫ్టీ మళ్లీ 25 వేల మార్కును అందుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 88.82గా ఉంది. సెన్సెక్స్లో టీసీఎస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, టైటాన్, ట్రెంట్ నష్టపడ్డాయి.




