కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ గ్రూప్-డి పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నవంబర్ 17 నుంచి డిసెంబర్ చివరి వరకు జరగనున్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. పరీక్షలకు వారం ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్, నాలుగు రోజుల ముందే అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.