AP: ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 22న రూ.13 వేల చొప్పున డబ్బులు జమ చేయనుంది. ఈ పథకం కింద మొత్తం 42,70,902 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం కూటమి ప్రభుత్వం రూ.10,120 కోట్లు విడుదల చేయనుంది. పథకం సక్రమంగా అందాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి, బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఏవైనా సమస్యలుంటే సమీప సచివాలయాన్ని సంప్రదించాలి.