TG: రూ.2వేల కోట్ల కుంభకోణం మంత్రులను వెంటాడుతుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జీవో నం.17 ఫైల్పై సంక్షేమ శాఖల మంత్రులు సంతకం చేయలేదా? అని ప్రశ్నించారు. పార్క్హయత్ హోటల్లో కూర్చుని కుంభకోణం చేశారని ఆరోపించారు. జీవో నం.17 రద్దు చేసే వరకు కొట్లాడుతామని స్పష్టం చేశారు.