TG: కేంద్రమంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. 'బండి సంజయ్కి హైదరాబాద్లో పాలు తాగితే జ్వరం వచ్చిందంట. ఆయన కుమారుడు చేసిన పనికి, అతనిని కాపాడడానికి బండి సంజయ్ 9 రోజులు చేసిన హై వోల్టేజ్ డ్రామా చూసి తెలంగాణ ప్రజలందరికి జ్వరం వచ్చింది. ఈ పోక్సో కేసులో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారా? ఆయనను విచారించారా?' అని ప్రశ్నించారు.