హైదరాబాద్ శివారు పటాన్చెరు సమీపంలోని ముత్తంగి గ్రామంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. 65వ జాతీయ రహదారిపై కారును తప్పించబోయి బస్సు అదుపుతప్పి డివైడర్ ఎక్కి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు పక్కన వాహనాల పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.