పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన
బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. సీఎం సువేందు అధికారి అక్రమ చొరబాటుదారులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకముందే వెళ్లిపోవాలని సూచించారు. విదేశీయుల చట్టం ప్రకారమే ఈ చర్యలు తీసుకుంటున్నామని, కొత్త చట్టం ఏమీ లేదని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ తన పౌరులను తిరిగి తీసుకోవడానికి సిద్ధంగా ఉందని, కాబట్టి అక్రమంగా ఉన్నవారు వెంటనే వెళ్లిపోవాలని సీఎం ఆదేశించారు.