TG: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతంలో 10 శాతం కోత విధిస్తామని, ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం త్వరలోనే చట్టం తీసుకువస్తామని అన్నారు. అలాగే గత ప్రభుత్వం టీజీపీఎస్సీని అంగడి సరుకుగా మార్చిందని, ఉద్యోగ నియామకాలు అడ్డుకునేందుకు కుట్రలు జరిగాయని విమర్శించారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.