టాలీవుడ్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో సోమవారం వివాహం చేసుకున్నారు. చాలా కొద్దిమంది సమక్షంలో జరిగిన ఈ పెళ్లిలో సమంత ఎరుపు చీరలో మెరిసింది. ముందుగా లింగ భైరవ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ఆమె పెళ్లి జరిగింది. పెళ్లి విషయంపై అఫిషియల్గా ప్రకటిస్తూ సమంత తన ఇన్స్టా పేజ్లో ఫోటోలను షేర్ చేశారు. కింద 01.12.2025 అని రాసి హార్ట్ సింబల్ని యాడ్ చేశారు.