శుక్రవారం కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో భార్య యాదమ్మ (21)ను భర్త ఆంజనేయులు (25) ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటనతో గ్రామంలో కలకలం రేగింది. డీఎస్పీ సత్తయ్య గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.