పటాన్చెరు పట్టణానికి చెందిన సామాజికవేత్త మెట్టు శ్రీధర్ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యువకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.