సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూరు గ్రామంలో సోమవారం శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా నిరుడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాల కార్యక్రమం జరిగింది. గ్రామస్థులు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.