ఆందోల్ లోని పురాతన శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. దేవాలయ అధికారులు, అర్చకులు మంత్రి గారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.