చౌటకూరు మండలం కొర్పోల్ గ్రామంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జయంతి బుధవారం నిర్వహించారు. కొర్పోల్ లోని రైతు వేదిక వద్ద బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అటల్ బిహారీ వాజపేయి దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.