భూటాన్లో జరిగిన అంతర్జాతీయ పోటీలో సంగారెడ్డి మండలం దాసుగడ్డ తండాకు చెందిన బిందు బంగారు పతకం సాధించారు. ఆదివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బిందును ప్రత్యేకంగా అభినందించి, పది దేశాలతో పోటీపడి గెలవడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు.