సిర్గాపూర్ మండలంలోని సర్పంచ్ తాండకు చెందిన జాదవ్ మహేష్ (18) హైదరాబాద్లో విద్యుత్ షాక్తో మృతి చెందాడు. జాదవ్ రాజు, సుజాత దంపతుల కుమారుడైన మహేష్ ఇటీవల ఇంటర్మీడియట్లో 950 మార్కులు సాధించి ఉన్నత చదువులపై ఆశలు పెట్టుకున్నాడు. అతని అకాల మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.