జిన్నారం మండల కేంద్రం ఎస్సీ వాడలోని పోచమ్మ గుడి నిర్మాణానికి జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి 1, 01, 116 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు గోకర్, శ్రీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.