కంది మండలం మక్త అల్లూరు గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచి శివకుమార్ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లావణ్య మైపాల్, వీరమణి, గొల్లపల్లి రమేష్, మన్నే లక్ష్మి, మేకల లక్ష్మి, బీర్ల మధు, గడ్డమీది నరసింహులు,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్ల రమేష్, తలారి ప్రభుతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.