బొల్లారం పట్టణంలో బుధవారం రాత్రి మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. అయితే, వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణమంతా అంధకారంలో మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.