బుధవారం ఉదయం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పీఎస్ఆర్ టౌన్షిప్కు చెందిన లక్ష్మి (29) ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్గా రావడంతో భర్త సిద్దు బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.