ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ రమణకుమార్ అన్నారు. జిన్నారం మండలం చెట్లపోతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.