గురువారం పటాన్ చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారిపై మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డివైడర్పైకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.