సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని అక్కమ్మ చెరువు అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని మత్తడి దూకుతోంది. గత వారం కిందటే చెరువు అలుగు పారగా, మరోసారి భారీ వర్షాలతో మత్తడి దూకడంతో స్థానిక రైతులు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.