దేశంలోని అంతరిక్ష కేంద్రాల్లో శిక్షణ కోసం అర్హులైన 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈనెల 31 తేదీ వరకు http: //jigyasa. iirs. gov. inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. శిక్షణకు ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్ 20వ తేదీన ప్రకటిస్తారని పేర్కొన్నారు.