సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణ రజక సంఘం అధ్యక్షుడు శివరాజ్, తన అనుచరులతో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన విమర్శించారు.