కొండాపూర్ సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అలవేణి 22 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా అలవేణి భర్త నర్సింహారెడ్డి పేరును మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఓటమిని చూసి కృంగిపోవద్దని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగ్గారెడ్డి కార్యకర్తలకు సూచించారు. తాను కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.