
తిరుమల భక్తులకు రైల్వేశాఖ అలర్ట్.. పలు రైళ్లు రద్దు
రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ముఖ్యంగా చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్ప్రెస్తో పాటు మరికొన్ని రైళ్లు ఈ నెల 26, 28 తేదీలలో రద్దు చేయబడ్డాయి. తమిళనాడులోని అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల వల్ల ఈ రద్దులు చోటుచేసుకున్నాయి. అలాగే, అరక్కోణం, చెన్నై సెంట్రల్, తిరుత్తణి సెక్షన్లలో 47 సబర్బన్ రైళ్ల రాకపోకల్లోనూ మార్పులు చేశారు. ప్రయాణికులు మారిన షెడ్యూల్స్ను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో గమనించాలని రైల్వేశాఖ సూచించింది.




