కందిలోని సెంట్రల్ జైలును జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలులోని వంటగది, స్టోర్ను పరిశీలించారు. అవసరమైన ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు పాల్గొన్నారు.