తరగతుల వారిగా విద్యార్థులు సామర్ధ్యాల పెంపుకు ఉపాధ్యాయులకు కృషి చేయాలని సదాశివపేట మండల విద్యాధికారి శంకర్ సూచించారు. సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు చతుర్విధ ప్రక్రియలను చేయించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.