సంగారెడ్డి పట్టణంలో ప్రధాన రహదారి నుంచి గంజి మైదానం వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం 23 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే, మూడు నెలల క్రితం కాంట్రాక్టర్ కంకర వేసి పనులు నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.