కంది గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సమస్యలపై జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి గురువారం అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మహేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వాణి పాల్గొన్నారు.