సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి ప్రత్యేక పూజలు చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని, 'బతుకమ్మ ఉయ్యాలో' అంటూ పాటలు పాడుతూ ఆటలాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.