విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, సంగారెడ్డిలో బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్, నాయకులు అఖిల్, గౌతమ్లను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజేందర్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేదని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.