షేక్ పేట డివిజన్ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 'బాకీ కార్డు' పేరుతో ప్రజల్లోకి వెళుతోందని, వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.