సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని దుర్గాభవాని ఆలయం 25వ వార్షికోత్సవాలు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం ఆలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. వార్షికోత్సవాల సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు, కల్యాణోత్సవం జరుగుతాయి. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది.